Vikram Misri: ఉగ్రచర్యలను భారత్ ఉపేక్షించదు..
ABN , Publish Date - May 07 , 2025 | 11:39 AM
operation sindoor: ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఐక్యరాజ్య సమితి విఫలమైందని, TRF అనేది లష్కరే తొయిబాకు ఒక ముసుగు అని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. ఉగ్రదాడులకు పాల్పడ్డవారిని నిఘా వ్యవస్థల ద్వారా గుర్తించామన్నారు. ఉగ్రసంస్థల కోసమే TRF పనిచేస్తోందని, అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలను పాక్ తప్పుదారి పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు.

న్యూఢిల్లీ: ఉగ్రచర్యలను (Terror Attack) భారత్ (India) ఉపేక్షించదని, పాక్ (Pok)లో ఉగ్రసంస్థలు ఉన్నాయని 2023లోనే ఐక్యరాజ్య సమితి (United Nations) దృష్టికి తీసుకెళ్లామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (India Foreign Secretary Vikram Misri) పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తూనే ఉందని, భారత్ చేసిన దాడి బాధ్యతాయుతమైనదని, దాడులకు పాల్పడేవారిని కచ్చితంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్లోని 9 ఉగ్ర శిబిరాలపై భారత్ సేనలు దాడి చేశాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
ఉగ్రసంస్థల కోసమే TRF..
ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఐక్యరాజ్య సమితి విఫలమైందని, TRF అనేది లష్కరే తొయిబాకు ఒక ముసుగు అని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. ఉగ్రదాడులకు పాల్పడ్డవారిని నిఘా వ్యవస్థల ద్వారా గుర్తించామన్నారు. ఉగ్రసంస్థల కోసమే TRF పనిచేస్తోందని, అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలను పాక్ తప్పుదారి పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ స్వర్గధామంగా మారిందన్నారు.
Also Read: ఆపరేషన్ సింధూర్పై చిరంజీవి ట్వీట్
అందుకే సరైనరీతిలో బుద్ధిచెప్పాం..
భారత్పై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని... నిఘా వర్గాలు హెచ్చరించాయని విక్రమ్ మిస్రీ అన్నారు. ఉగ్రసంస్థల మౌలిక వసతులు ధ్వంసం చేసేందుకే సరిహద్దు దాటి భారత్ దాడి చేసిందన్నారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్ దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని, భారత్ తన అధికారాన్ని ఉపయోగించి.. ఆపరేషన్ సింధూర్ చేపట్టిందని స్పష్టం చేశారు. పహల్గామ్ దాడిలో మరో కుట్ర ఉందని, కశ్మీర్తో సహా దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారన్నారు. కశ్మీర్ను గతేడాది 2.3 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారని, జమ్మూ కశ్మీర్ పర్యాటకంగా, ఆర్థికంగా వృద్ధి చెందుతోందన్నారు. పహల్గామ్ దాడితో ఇదంతా దెబ్బతీయాలని చూశారని, అందుకే సరైనరీతిలో బుద్ధిచెప్పామని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.
పాక్ పౌరులకు హాని కలగని రీతిలో దాడులు..
కాగా పహల్గామ్ మృతులకు న్యాయం చేసేందుకే.. 'ఆపరేషన్ సింధూర్’ చేపట్టామని కల్నల్ సోఫియా ఖురేషి చెప్పారు. గత 30 ఏళ్లుగా ఉగ్రమూకలకు పాక్ సౌకర్యాలు కల్పిస్తోందని ఆరోపించారు. పాక్లోని 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. పాకిస్థాన్, పీవోకేలోనూ ఉగ్ర శిబిరాలు ఉన్నాయని, మొత్తం 21 ఉగ్రస్థావరాలను గుర్తించామన్నారు. పాక్ పౌరులకు హాని కలగని రీతిలో దాడులు జరిగాయని సోఫియా ఖురేషి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..
Rahul Gandhi: సాయుధ దళాలను చూసి గర్వపడుతున్నా..
పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు
For More AP News and Telugu News