Share News

Viral News: నిజం చెప్పిన జర్నలిస్ట్‌పై దాడి.. నలుగురి అరెస్ట్‌

ABN , Publish Date - May 27 , 2025 | 10:42 AM

సమాజంలో నిజాలను వెలికితీసే జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఇదే పనిని ఇటీవల ఓ జర్నలిస్ట్ చేయగా, అతనిపై దాడి చేశారు. ఓ చోట జరుగుతున్న నిర్మాణ పని గురించి ఆరా తీయగా, అతనిపై దాడి చేశారు. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Viral News: నిజం చెప్పిన జర్నలిస్ట్‌పై దాడి.. నలుగురి అరెస్ట్‌

దేశంలో కొన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులు నిజాలను చెప్పే ప్రయత్నం చేసినా కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఒడిషా బోలాంగిర్ జిల్లాలో అలాంటి ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. బోలాంగిర్ గ్రామానికి వెళ్లి పబ్లిక్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల్లో అనుమానాస్పద పనులను పరిశీలిస్తున్న జర్నలిస్ట్ బిజయ్ ప్రదాన్‌పై దాడి జరిగింది. ‎బిజయ్ ప్రదాన్ ఒక పత్రికా జర్నలిస్ట్. బోలాంగిర్‎లో ఓ గ్రామానికి వెళ్లి అక్కడ నిర్మిస్తున్న రక్షణ గోడ నిర్మాణంలో తప్పిదాలు ఉన్నాయని అనుమానించి, నిజాన్ని బయటపెట్టేందుకు ప్రయత్నించాడు. ఆయన అక్కడ సమాచారం సేకరిస్తూ, ఫోటోలు తీస్తూ, ప్రాంతీయ ప్రజల నుంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.


దాడి చేయడంతోపాటు..

దీనిని గమనించి అక్కడే ఉన్న పలువురు అతన్ని కొట్టారు. ముఖంపై కాళ్లతో తన్ని అసభ్యంగా ప్రవర్తించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దాడి చేసింది నలుగురు అని తేలగా, అందులో ఒకరు మైనర్ వ్యక్తి ఉన్నాడు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి దాడి చేసిన వారిని అరెస్టయ్యారు. ఈ దాడి సమయంలో జర్నలిస్ట్ బిజయ్ ప్రదాన్‌ నుంచి మొబైల్ ఫోన్, ఇతర పరికరాలు కూడా దొంగలించబడ్డాయి. అయితే ఈ దాడి కుట్రలో భాగంగా జరిగిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


నేతల డిమాండ్..

దర్యాప్తులో భాగంగా వాల్ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ పాత్ర విషయంలో అనుమానం ఉందని పోలీసులు తెలిపారు. అతడిని కూడా విచారిస్తున్నామని, ఇన్వెస్టిగేషన్ పూర్తైన తర్వాత ఆయనకి సంబంధించిన తప్పులు ఉంటే వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. సాధారణంగా ప్రజల ప్రయోజనాలు, అవినీతిని బయటపెట్టేందుకు జర్నలిస్ట్‌లు పనిచేస్తారు. తప్పులను వెలుగులోకి తీసుకురాకపోతే దాని గురించి ప్రజలకు తెలియకుండా పోతుంది. అలాంటి విషయాలను వెలికితీసే జర్నలిస్ట్‌పై దాడి చేయడం నిజంగా దురదృష్టకర విషయమని చెప్పుకోవచ్చు. ఈ ఘటన నేపథ్యంలో జర్నలిస్టుల హక్కులు కాపాడాలని, ఈ ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘ నేతలు డిమాండ్ చేశారు.


ఇవీ చదవండి:

గుంపులోకి దూసుకెళ్లిన కారు..47 మందికి గాయాలు..


సీక్రెట్ కోడ్ ట్రిక్స్.. సైబర్ నేరాలకు చెక్‌..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 04:57 PM