ఈ రోజు 02 06 2025 వివిధ కార్యక్రమాలు
ABN , Publish Date - Jun 02 , 2025 | 01:27 AM
‘తెలుగు జాడలు’ పుస్తకంపై చర్చా సమావేశం, శీలావీ పురస్కార ప్రదానం, కథ, కవిత, వ్యాసం, ఆధ్మాత్మిక సంపుటాలకు ఆహ్వానం...

‘తెలుగు జాడలు’ పుస్తకంపై చర్చా సమావేశం
తెలుగు రాష్ట్రాలకు వెలుపల ప్రాచీన తెలుగు మూలాలున్న ప్రజల జీవితాల గురించి ఆ ప్రాంతాలకు ప్రయాణించి, ఆ ప్రజలతో సంభాషించిన అనుభవాలతో ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు రాసిన పుస్తకం ‘తెలుగు జాడలు’పై చర్చా సమావేశం జూన్ 5 సాయంత్రం 6.30ని.లకు లామకాన్, బంజారాహిల్స్, హైదరాబాద్లో జరుగుతుంది. వివరాలకు: 96427 31329.
సుమనస్పతిరెడ్డి
శీలావీ పురస్కార ప్రదానం
శీలావీ సాహిత్య చిత్రకళా వేదిక 2025 సంవత్సరానికి గాను శీలా వీర్రాజు కథానికా పురస్కారాన్ని ‘గారడివాడు’ కథా సంపుటి రచయిత కె.ఎ. ముని సురేష్ పిళ్ళెకి, శీలా వీర్రాజు చిత్రకళా పురస్కారాన్ని చిత్రకారుడు పి.ఎస్. చారికి ఇస్తున్నది. రూ.15వేల నగదు, జ్ఞాపికతో పురస్కార ప్రదానం జూన్ 7 సాయంత్రం 5.30ని.లకు రవీంద్ర భారతి (మొదటి అంతస్తు), హైదరాబాద్లో జరుగుతుంది. విహారి, మామిడి హరికృష్ణ, ఇంద్రగంటి మోహనకృష్ణ, అమృతలత, ఎమ్వీ రామిరెడ్డి పాల్గొంటారు. శీలావీ చిత్రలేఖనాలపై వ్యాస సంకలనం ‘ఒక చిత్రకారుడు – అనేక అవలోకనాలు’, శీలా వీర్రాజు ఫాంట్తో 250 మంది కవుల కవితా సంకలనం ‘శీలాక్షరాలు’ ఆవిష్కరణలు జరుగుతాయి.
శీలా సుభద్రాదేవి
కథ, కవిత, వ్యాసం, ఆధ్మాత్మిక సంపుటాలకు ఆహ్వానం
ఈశ్వరగారి ముక్తేశ్వరి ఫౌండేషన్ ఇచ్చే సాహితీ అవార్డుల కోసం 2024లో ప్రచురితమైన కథా, కవితా, వ్యాస, ఆధ్యాత్మికా సంపుటాలను పంపాలి. ఒక్కో విభాగానికి రూ.10,116 చొప్పున నగదు పారితోషికం తోపాటు, జ్ఞాపికతో వేములవాడలోని ముక్తేశ్వరి ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంలో సత్కారం ఉంటుంది. రచనలు మూడేసి ప్రతులను జూన్ 25 లోపు పంపాల్సిన చిరునామా: ఈశ్వరగారి నరహరి శర్మ, చైర్మన్, ఈశ్వరగారి ముక్తేశ్వరి ఫౌండేషన్, ఓల్డ్ మార్కెట్, వేములవాడ– 505302 ఫోన్: 93966 48880.
మంగారి రాజేందర్