Share News

Book Launch: తెలంగాణలో జరగనున్న సాహిత్య కార్యక్రమాలు

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:33 AM

తెలంగాణలో జూన్ 11 నుంచి 15 వరకు పలు సాహిత్య, కవిత్వ, గ్రంథావిష్కరణ సభలు, పురస్కార కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో ప్రముఖ రచయితలు, కవులు, సమీక్షకులు పాల్గొననున్నారు.

Book Launch: తెలంగాణలో జరగనున్న సాహిత్య కార్యక్రమాలు

  • రాజకీయఖైదీల గొంతుకలతో పుస్తకం

‘చందమామను ఎంత కాలం బందీ చెయ్యగలరు – భారతీయ రాజకీయ ఖైదీల గొంతుకలు’ (రచన: సుచిత్ర విజయన్‌, ఫ్రాన్సెస్కా రెకియా; అనువాదం: కె. సురేష్‌) పుస్తకం ఆవిష్కరణ సభ జూన్‌ 11, సా.5.30గంటలకు బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. ముఖ్య అతిథి ప్రకాష్‌ రాజ్‌; సభాధ్యక్షులు యాకూబ్‌; పుస్తక పరిచయం ఎన్‌. వేణుగోపాల్‌; వక్తలు ఘంటా చక్రపాణి, కల్పనా కన్నభిరన్‌, ఖలీదా పర్వీన్‌; వందన సమర్పణ మలుపు బాల్‌రెడ్డి.

-మలుపు బుక్స్‌


  • ఉత్తమ గ్రంథ పురస్కారాలు

తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథ పురస్కారాల ప్రదానోత్సవం జూన్‌ 11 సా.5.30గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్‌, తిలక్‌ రోడ్‌, అబిడ్స్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. ముఖ్య అతిథి గుత్తా సుఖేందర్‌ రెడ్డి, అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి, సమన్వయకర్త రింగురామ్మూర్తి. ఉత్తమ గ్రంథ పురస్కారాలను కాంచనపల్లి గోవర్ధనరాజు, ఉదారి నారాయణ, రామాచంద్రమౌళి, కాలువ మల్లయ్య, సంగిశెట్టి శ్రీనివాస్‌, సంగనభట్ల నర్సయ్య, అమరవాది నీరజ; వరిష్ఠ పురస్కారాలను రంగరాజు పద్మజ, ఎలనాగ, ఎస్‌. ఆర్‌. వెంకటేశం, రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌ అందుకుంటారు.

జె. చెన్నయ్య


  • రెండుతరాల కవిసంగమం

రెండుతరాల కవిసంగమం సీజన్ – 2, సీరీస్ – 41 జూన్‌ 14 సా.6గంటలకు నిజాం కాలేజి, బషీర్ బాగ్, హైదరాబాద్‌లో జరుగుతుంది. పాల్గొను కవులు: లక్ష్మీనరసయ్య గుంటూరు, తుల శ్రీనివాస్, రూప రుక్మిణి, జబ్బు వెంకటేష్, చుక్క వంశీ

యాకూబ్‌


‘అల్లిక’ కవితా సంపుటి

చల్లపల్లి స్వరూపరాణి కవితా సంపుటి ‘అల్లిక’ ఆవిష్కరణ సభ జూన్ 15 సా.5గంటలకు బాలోత్సవ్ భవన్, రెండో అంతస్తు, విజయవాడలో జరుగుతుంది. వక్తలు: జి. లక్ష్మీనరసయ్య, శిఖామణి, యాకూబ్‌, గూడురు సీతామాలక్ష్మి, నూకతోటి రవికుమార్, షేక్ కరీముల్లా, దుప్పల రవికుమార్ తదితరులు పాల్గొంటారు.

-బహుజన రచయితల వేదిక


‘జీవన సౌరభాలు’ పద్య సంపుటి

ఓలేటి ఉమా సరస్వతి పద్య కవితా సంపుటి ‘జీవన సౌరభాలు’ ఆవిష్కరణ సభ జూన్ 15 సా.5:30 నిమిషాలకు బుక్ ఫెస్టివల్ సొసైటీ మీటింగ్ హాల్‌, విజయవాడలో జరుగుతుంది. అధ్యక్షత గుత్తికొండ సుబ్బారావు, ఆవిష్కర్త మండలి బుద్ధ ప్రసాద్, పుస్తక సమీక్ష గుమ్మా సాంబశివరావు, గౌరవ అతిథి జి.వి. పూర్ణచందు. వివరాలకు: 9247475975.

చలపాక ప్రకాష్

Updated Date - Jun 09 , 2025 | 12:34 AM