ఈ రాశి వారికి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగే ప్రమాదం ఉంది
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:52 AM
నేడు 03-06-2025 మంగళవారం, ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది.. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది...

నేడు 03-06-2025 మంగళవారం, ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది.. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది.. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో పొరపాట్లు కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాదన మేలు చేస్తుంది.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ప్రియతముల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. క్రీడలు, ఆడిటింగ్, టెలివిజన్ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైన వస్తువుల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి. లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో నిరాశకు లోనవుతారు. కుటుంబ విషయాలో కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. మీ ఆలోచనలను సమీక్షించుకుంటారు. ఆంజనేయ స్వామిని ఆరాధన మేలు చేస్తుంది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
లక్ష్య సాధనలో విద్యార్థులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు, చర్చల్లో జాగ్రత్తలు పాటించండి. కీలక పత్రాలు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవింగ్లో నిదానం అవసరం. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. బృంద కార్యక్రమాలు కోసం ఖర్చులు అధికం. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగే అవకాశం ఉంది. పెద్దలు, పై అధికారుల నుంచి మాటపడాల్సి రావచ్చు. కొత్త పనుల ప్రారంభాన్ని ఈ రోజుకు వాయిదా వేయడం మంచిది. లక్షీ నరసింహ స్వామి ఆరాధన శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
దూరప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంచనాలు ఫలించకపోవడంతో ఆందోళనకు గురవుతారు. సమావేశాలు, చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. హనుమాన్ చాలీసా పారాయణ మంచిది.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ఆశాభంగానికి గురవుతారు. రుణ బాధ పెరుగుతుంది. సన్నిహతుల రోగ్యం కలపవరపెడుతుంది. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. విలువైన వస్తువుల విషయాలో అప్రమత్తత అవసరం. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో, బృందకార్యక్రమాల్లో మాటపడాల్సి రావచ్చు. గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగే ప్రమాదం ఉంది. వివాహ నిర్ణయాల విషయంలో పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. కీలక పదవుల విషయంలో ఆశాభంగం కలిగే అవకాశం ఉంది. లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన ఊరటనిస్తుంది.
మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు, చర్చలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. న్యాయ, బోధన, కళలు, రవాణా, రక్షణ రంగాల వారికి అనుకోని సమస్యలు ఎదురవుతాయి. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ప్రియతముల ఆరోగ్యం కలవరపెడుతుంది. బీమా, పన్నులు, పెన్షన్ వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురవుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
సన్నిహితుల వైఖరి మనస్తాపానికి గురిచేస్తుంది. వేడుకల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. సమావేశాల్లో మాటపడాల్సి రావచ్చు. భాగస్వామి వైఖరి బాధిస్తుంది. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ