Minister Kandula Durgesh: నంది అవార్డులపై మంత్రి దుర్గేష్ కీలక ప్రకటన
ABN , Publish Date - May 19 , 2025 | 06:46 PM
Nandi Awards: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్లాన్లు వేస్తామని అన్నారు.

ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ నంది అవార్డులపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే నంది అవార్డులను ప్రకటిస్తామని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమను నూటికి నూరు శాతం అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. భైరవం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యాక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో అద్భుతమైన అందాలు ఉన్నాయని, అక్కడ సినిమా షూటింగులు కూడా జరుగుతున్నాయని అన్నారు.
ఏపీలో స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్, రీరికార్డింగ్ థియేటర్లు నిర్మించడానికి అవసరమైన మద్దతు ఇవ్వడానికి పాలసీ తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ లాగానే విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. చాలా కాలంగా మూలన పడిన నంది అవార్డులను పునరుద్ధరిస్తామని తెలిపారు. త్వరలోనే నంది అవార్డులను ప్రకటిస్తామని కూడా అన్నారు. సినిమా పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ప్రొడ్యూషర్లు, దర్శకులు, నటీనటులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్లాన్లు వేస్తామని అన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూటికి నూరు శాతం కృషి చేస్తామని చెప్పారు. కాగా, నంది అవార్డులకు చాలా ఏళ్ల చరిత్ర ఉంది. 1964 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు నంది అవార్డులు ఇస్తోంది.
ఇవి కూడా చదవండి
Mumbai Shocker: ఇలాంటి తల్లి ఎవ్వరికీ ఉండకూడదు.. మరీ నీచంగా..
Shilpa Shirodkar: సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలికి కొవిడ్