Share News

Maoist Encounter: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. కీలక మావోయిస్టులు హతం..

ABN , Publish Date - May 07 , 2025 | 05:25 PM

Maoist Encounter 2025: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆంధ్రా గ్రే హౌండ్స్, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.

Maoist Encounter: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. కీలక మావోయిస్టులు హతం..
AP Odisha Border Maoist Operation

Karre Gutta Maoist Encounter 2025: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. ఆంధ్రా గ్రే హౌండ్స్, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కీలక మావోయిస్టు నాయకులు మృతి చెందారు. నక్సల్స్ నుంచి భద్రతా దళాలు రెండు ఏకే 47 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటివరకూ నలుగురు మావోయిస్టులు కాల్పుల్లో మృతి చెందినట్లు సమాచారం. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.


ఇద్దరు కీలక నేతలు హతం..

ఆంధ్ర- ఒడిశా సరిహద్దు ఎన్ కౌంటర్ లో హతమైన నలుగురిలో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలున్నారు. వీరిలో ఒకరు మావోయిస్ట్ పార్టీలో డిస్ట్రిక్ట్ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న వాగ పోడియామిగా గుర్తించారు. ఇతడిపై ప్రభుత్వం 8 లక్షల రివార్డ్ ప్రకటించింది. ఎన్ కౌంటర్ లో చనిపోయిన మరో కీలక నేత సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు కాకూరి పామ్మడన్న ప్రభుత్వం గుర్తించింది. కాకూరి తలపై 20 లక్షలు రివార్డ్ ప్రకటన ఉంది. ఎన్ కౌంటర్ లో మరణించిన ఇరువురు నేతల నుంచి గ్రే హౌండ్స్ పోలీసులు అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.


కాగా, ఇవాళ ఉదయం తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లోనూ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 20 మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు. భద్రతా దళాలు మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో తలదాచుకుంటున్న మావోయిస్టులను మట్టుబెట్టడమే ధ్యేయంగా భద్రతా దళాలు ఈ కీలక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.


Read Also: Vamsi Remand News: వంశీకి మళ్లీ నిరాశే.. మరికొన్ని రోజులు

Nara Lokesh: ఆయన ఉన్నంతవరకూ.. మన నేలపై గడ్డి మొక్క కూడా పీకలేరు..

Minister Anitha: ఆపరేషన్ సిందూర్ ప్రపంచ పటముపై మరోసారి నిలిపింది: అనిత

Updated Date - May 07 , 2025 | 08:58 PM