Bhimunipatnam: బాలికపై అత్యాచారం ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:56 AM
విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది. ఈ క్రమంలో బాలికకు....

భీమునిపట్నం (విశాఖపట్నం), జూన్ 8 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది. ఈ క్రమంలో బాలికకు.. హేమలత అనే మహిళతో పరిచయమైంది. ఆమె చేపల తిమ్మాపురంలో రాడ్ బెండింగ్ పనులు చేస్తున్న నూకరాజుకు పరిచయం చేసింది. అతను ఉపాధి చూపిస్తానని నమ్మబలికి ఇంటికి తీసుకువెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరున జరిగిన ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు శనివారం భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు కేజీహెచ్కు తరలించారు. నూకరాజు, అతడికి సహకరించిన హైమావతిపై పోక్సో నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.