AP Oil Palm Farmers: ఆయిల్పామ్ రైతుల ప్రయోజనాలు కాపాడాలి
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:13 AM
ఏపీ ఆయిల్పామ్ రైతు సంఘం, కేంద్ర సుంకం తగ్గింపు నోటిఫికేషన్ను తిరస్కరించి ముడి వంట నూనెలపై 50 శాతం సుంకం పునఃప్రతిష్ట చేయాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. సీపీవో ధరల కుదింపుతో రైతులకు ఆర్థిక నష్టాలు ఏర్పడుతున్నాయి అని తెలిపింది.

సీఎంకు ఏపీ ఆయిల్పామ్ రైతు సంఘం విజ్ఞప్తి
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆయిల్పామ్ రైతుల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఏపీ ఆయిల్పామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీవీ రాఘవరావు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వం జారీ చేసిన కస్టమ్స్ సుంకం తగ్గింపు నోటిఫికేషన్ను వెనక్కి తీసుకుని, ముడి వంట నూనెలపై 50ు కస్టమ్స్ సుంకాన్ని తిరిగి విధించేలా కేంద్రానికి సిఫారసు చేయాలని కోరారు. ఈ మేరకు సీఎంకు ఆదివారం ఆయన లేఖ రాశారు. గత రెండు నెలల్లో సీపీవో ధర టన్నుకు రూ.లక్షా10వేలకు పడిపోవడంతో ఎఫ్ఎ్ఫబీ ధర భారీగా తగ్గిందని, గత 30ఏళ్లలో సీపీవోపై దిగుమతి సుంకం తగ్గించినప్పుడు, ఎఫ్ఎ్ఫబీ ధర తగ్గినప్పుడు, సాగు ఖర్చులు పెరిగినప్పుడల్లా రైతులు ఆయిల్పామ్ తోటల్ని తీసేస్తున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.